Gossipsబాబీ వల్ల జై లవకుశ కి వ్యాపారం సాగటం లేదు...ఇక ఎన్టీఆర్...

బాబీ వల్ల జై లవకుశ కి వ్యాపారం సాగటం లేదు…ఇక ఎన్టీఆర్ మాత్రమే ఆదుకోవాలి..!!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కె.ఎస్.రవింద్ర అలియాస్ బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జై లవకుశ. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఈమధ్యనే రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టిస్తుంది. టీజర్ చూసి భారీగా బిజినెస్ జరుగుతుందని ఆశించిన జై టీం కు పెద్ద షాక్ తగిలింది. ఎన్.టి.ఆర్ స్టామినా ప్రూవ్ చేసేలా సినిమా ఉంటుందని తెలిసినా డైరక్టర్ బాబి వల్ల సినిమా మీద పూర్తి నమ్మకం పెట్టలేకపోతున్నారట. దర్సకుకి కెరియర్ లో భారీ హిట్ లేకపోగా సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ గా మిగిలింది.

అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ లో 120 కోట్లు టార్గెట్ పెట్టుకున్న నిర్మాత కళ్యాణ్ రాం కు బిజినెస్ అవ్వట్లేదని టాక్. తారక్ కెరియర్ లో ఆల్ టైం ఫేవరేట్ హిట్ అయిన జనతా గ్యారేజ్ 85 కోట్లకు అటు ఇటుగా బిజినెస్ క్లోజ్ అయ్యింది. ఇక టీజర్ ఏర్పరచిన సంచలనాలతో జై లవకుశను స్టార్టింగ్ బిజినెస్సే 80 కోట్లకు పెట్టారట. అంటే ఈ లెక్కన 100 కోట్ల వరకు జై లవకుశని తీసుకునే ఆలోచనల్లో ఉన్నారట. కాని కళ్యాణ్ రాం మాత్రం తాను చెప్పిన రేటుకి పైసా కూడా తగ్గించేది లేదని చెబుతున్నారట.అయితే ఎన్టీఆర్ గత కొన్ని సినిమాలనుండి కథా బలమున్న సినిమాలు చేయటం వలన కేవలం ఎన్టీఆర్ మీద నమ్మకంతో మాత్రమే బిజినెస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని టాక్.

జై లవకుశ సినిమాలో తారక్ ట్రిపుల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాతగా కళ్యాణ్ రాం కెరియర్ లో మొదటిసారి భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సెప్టెంబర్ 21న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా బిజినెస్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news