Movies‘జై లవ కుశ’లో తారక్‌తో రొమాన్స్ చేయబోయే ఆ రెండో హీరోయిన్...

‘జై లవ కుశ’లో తారక్‌తో రొమాన్స్ చేయబోయే ఆ రెండో హీరోయిన్ ఈ యంగ్ బ్యూటీనే!

స్టార్ హీరోల సరసన నటించాలనే కోరిక ప్రతిఒక్కరికీ వుంటుంది. వాళ్లతో నటిస్తే తమ కెరీర్ ఊపందుకుంటుందన్న ఉద్దేశంతో.. యంగ్ హీరోయిన్లు ఆఫర్స్ రాబట్టుకోవడం కోసం నానాతంటాలు పడుతుంటారు. కానీ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అది అంత సులువైన విషయం కాదు. స్టార్ హీరోయిన్లకే ఆఫర్స్ రాక చస్తున్న ఈరోజుల్లో.. యంగ్ బ్యూటీల పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ట్యాలెంట్ వుంటే మాత్రం పిలవని పేరంటంలా బోలెడన్నీ ఆఫర్స్ గుమ్మంముందుకొచ్చి వాలిపోతాయి. ఇప్పుడదే నివేదా థామస్‌కి జరుగుతోంది. నాని సరసన ‘జెంటిల్‌మెన్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఈ యంగ్ బ్యూటీ.. తన నటనా ప్రతిభతో ఇటు సినీ ప్రేక్షకుల్నే కాదు, విమర్శకుల్ని సైతం ఆకట్టుకుంది. దీంతో.. ఆమెకి భారీ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. అందులో భాగంగా.. తారక్ సరసన ‘జై లవ కుశ’లో లీడ్ రోల్‌లో నటించే బంపరాఫర్‌కి కొట్టేసింది.

వాస్తవానికి.. చాలారోజుల నుంచి నివేదని హీరోయిన్‌గా ‘జై లవ కుశ’ టీమ్ ఎంపిక చేసిందనే వార్తలు వస్తున్నాయి కానీ.. యూనిట్ అధికారికంగా ప్రకటించనే లేదు. మొదట్లో రాశీఖన్నాని మాత్రమే తీసుకున్నట్లుగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత నివేదని కూడా మరో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు అధికారిక ప్రకటన చేసింది. ‘జెంటిల్‌మెన్’ మూవీలోలాగే ఈ సినిమాలోనూ నివేద ఓ ఛాలెంజింగ్ రోల్‌లో నటిస్తోందని, ఆ పాత్రకి ఈ బ్యూటీ కరెక్ట్‌గా సరిపోతుందనే ఉద్దేశంతోనే ఆమెని సెలెక్ట్ చేసుకున్నారని తెలిసింది. కృషి వుంటే మనుషులు రుషులవుతారన్న సామెతకి నివేదని నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆఫర్ల కోసం హీరోయిన్లు పోటాపోటీ పడుతున్న ఈరోజుల్లో.. ఒకే ఒక్క సినిమాతో తన ప్రతిభ చూపించి, ఎన్టీఆర్‌లాంటి స్టార్ హీరోతో జతకట్టే ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాతో నివేదా కెరీర్ మరింత ఊపందుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.నివేదా లాంటి టాలెంటెడ్ హీరోయిన్ ఎన్టీఆర్ కి జత కట్టడంతో ఫాన్స్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news