Newsరంగస్థల కథానాయకుడు ఎన్టీఆర్ అయ్యింటే.. ఆ లెక్క ..!

రంగస్థల కథానాయకుడు ఎన్టీఆర్ అయ్యింటే.. ఆ లెక్క ..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా సెకండ్ హాఫ్ ల్యాగ్ అయ్యింది.. రన్ టైం ఎక్కువైందన్న వార్తలు వస్తున్నా సరే సినిమాకు మాత్రం మంచి టాకే వచ్చింది. అయితే ఈ సినిమాలో ముఖ్యంగా చరణ్ నటన గురించి అందరు మాట్లాడుతున్నారు.

చిట్టిబాబుగా చరణ్ చితక్కొట్టేశాడని అందరు ప్రశంసిస్తున్నారు. అయితే ఈ చిట్టిబాబు ఆడియెన్స్ ను మెప్పించేందుకు బాగానే కష్టపడ్డాడని తెలుస్తుంది. అయితే ఇదే సినిమాలో చిట్టిబాబుగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అయ్యుంటే ఎలా ఉండేది. ఇదే విషయాన్ని ప్రస్థావిస్తున్నారు నందమూరి అభిమానులు. రంగస్థలంలో కథనాయకుడు ఎన్.టి.ఆర్ అయ్యుంటే ఆ లెక్క వేరేలా ఉండేదని అంటున్నారు.

చరణ్ ది బెస్ట్ అనిపించినా.. తారక్ చేసుంటే మాత్రం ఇంకా మ్యాజిక్ వర్క్ అవుట్ అయ్యేదని అంటున్నారు. జై లవ కుశ సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూశాం. ఫ్యాన్స్ గోల ఎలా ఉన్నా నందమూరి ఫ్యాన్స్ కూడా రంగస్థలంలో చరణ్ నటన చూసి మెచ్చుకునే అవకాశం ఉంది. అదీగాక చరణ్ ఎన్.టి.ఆర్ తో కలిసి మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news