Gossipsబండోడి సంగతి చెబుతా.. కత్తి మహేష్ పై జీవి వీరంగం..!

బండోడి సంగతి చెబుతా.. కత్తి మహేష్ పై జీవి వీరంగం..!

ఛాన్స్ దొరికితే పవన్ ను పవన్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న కత్తి మహేష్ కు సరైన కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు విలన్ కం డైరక్టర్ జీవి సుధాకర్ నాయుడు. ఇటీవల ఏపి ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల ప్రస్థావనలో అవి ఎయ్యో అవార్డులను అనేశాడు. ఇక పవన్ రాజకీయ ప్రవేశం వల్లే కొందరు అతన్ని టార్గెట్ చేశారని అంటున్నాడు.
కోళ్లు కొక్కొరొకో అన్నా పర్వాలేదు.. కాని గుడ్లు కొక్కొరొకో అంటున్నాయి. ఈమధ్య ఓ రియాలిటీ షోలో బండోడు మరుగుడొడ్లు కడిగివచ్చి పవన్ ను విమర్శిస్తున్నాడు. హైదరాబాద్ వెళ్లి అతని సంగతి చెబుతా అన్నాడు జీవి. ఒకటి రెండు సార్లు కాదు 3 సార్లు చెప్పాక తానేంటో చూపిస్తా అని అన్నారు. తేడా సింగ్ లు మాత్రమే కాదు.. తేడా నాయుడులు ఉంటారని చెప్పుకొచ్చాడు జీవి.
దాసరి గారి వల్లే తాను పరిశ్రమలోకి అడుగు పెట్టానని.. చిరంజీవి గారంటే తనకు చాలా ఇష్టమని.. అందుకే దాసరి గారు చిరంజీవిలోని చివరి రెండు అక్షరాలు తన పేరు ముందు ఉంచారని అన్నారు. మొత్తానికి నంది గొడవ మీద స్పందించిన జీవి కత్తి మహేష్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. మరి కత్తి మహేష్ జీవి కామెంట్స్ కు ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news