Gossipsచిరంజీవి,ప్రభాస్ మధ్య వార్ తప్పదా..?

చిరంజీవి,ప్రభాస్ మధ్య వార్ తప్పదా..?

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా విడుదలై దాదాపు సంవత్సరం కాబోతుంది. అయినా ఇప్పటి వరకు 151వ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాలేదు. చిరంజీవి 151వ సినిమాగా సైరా నరసింహారెడ్డి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. మూడు నాలుగు నెలల క్రితమే ఈ సినిమా షూటింగ్‌ పూజా కార్యక్రమాలు జరిగాయి. సినిమాకు సంబంధించిన లోగోను కూడా విడుదల చేశారు. కాని సినిమా మాత్రం ఆలస్యం అవుతూ వస్తుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్‌లో చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నారు. డిసెంబర్‌లో చిత్రీకరణ మొదలు పెట్టి 2019 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. మరో వైపు ప్రభాస్‌ సాహో సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్లాన్ చేస్తున్నారు. ఆ కారణంగా ఈ చిత్రం షూటింగ్‌ చాలా ఆలస్యం అవుతుందని, ముందుగా అనుకున్న ప్రకారం సినిమాను విడుదల చేయలేమని ఇప్పటికే యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు చేతులెత్తేశారు.

ఈ నేపథ్యంలో సాహో కూడా 2019 సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. బాహుబలి సినిమాతో నేషనల్ లెవల్ లో కూడా గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్‌ సాహో సినిమాపై సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. 2019 సంక్రాంతికి చిరంజీవి, ప్రభాస్‌ల మద్య పెద్ద వార్‌ ఖాయంగా కనిపిస్తోంది. మరి బాహుబలి మీద సైరా గెలుస్తుందా లేదా అన్నది చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news