Newsరోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటి మృతి..!

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటి మృతి..!

ఈమధ్య రోడ్ యాక్సిడెంట్ లో సెలబ్రిటీస్ మృతి చెందటం ఎక్కువైంది. ప్రభుత్వం రోడ్ సెఫ్టీ రూల్స్ ఎన్ని చేపట్టినా అవతల వారి వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఈమధ్య సెలబ్రిటీస్ ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ లో మరణించడం జరుగుతుంది. రీసెంట్ గా భోజ్ పూరి హీరోయిన్ మనీషా రాయ్ రోడ్ యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది.

అది కూడా తన తప్పు లేకున్నా సరే ఆమె ప్రాణాలు విడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ లోని బుల్లియ ప్రాంతంలో ఓ సినిమా షూటింగ్ జరుగుతుందట. సహనటుడు సంజీవ్ మిశ్రాతో కలిపి షూటింగ్ లో పాల్గొనేందుకు వెళ్తున్న మనీషా రాయ్ వారు ప్రయాణిస్తున్న బైక్ ను వెనుక నుండి కారు వేగంగా వచ్చి గుద్దేయడంతో వెనుక కూర్చున్న మనీషా రాయ్ కు తీవ్ర గాయాలవగా సంజీవ్ మిశ్రాకు చిన్న చిన్న గాయాలు అయ్యాయట.

అయితే స్థానికులు దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మనీషా రాయ్ మరణించడం జరిగిందట. ఈ మృతి పట్ల భోజ్ పూరి పరిశ్రమ తీవ్ర ఆదోళన చెందింది. ఇక యాక్సిడెంట్ కు కారణమైన ఆ కారు డ్రైవర్ పరారీలో ఉండగా ఘటనా స్థలంలో పోలీసులు వివరాలను సేకరించింది విచారణ జరుపుతున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news