Gossipsకళ్యాణ్ రాం నిర్మాతలు అదిరిపోయే ప్లాన్..!

కళ్యాణ్ రాం నిర్మాతలు అదిరిపోయే ప్లాన్..!

నందమూరి కళ్యాణ్ రాం హీరోగా ఉపేంద్ర మాధవ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఎం.ఎల్.ఏ. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి కలిసి నిర్మించారు. 12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను 13 కోట్లకు అది కూడా కొన్ని ఏరియాల్లోనే అమ్మేసి టేబుల్ ప్రాఫిట్ పొందారు నిర్మాతలు.

ఆంధ్రాలో మాత్రమే కొన్ని ఏరియాల్లో సినిమాలను అమ్మేసిన నిర్మాతలు సీడెడ్, నైజాం లలో వారే సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇలా రిలీజ్ చేయడంలో వారి స్ట్రాటజీ ఉందని తెలుస్తుంది. సినిమా శాటిలై 4.50 కోట్లు, డిజిటల్ 2.40 కోట్లు లాగేయగా మిగిలిన ఏరియాలన్ని కలిపితే కచ్చితంగా ఎంతవచ్చినా సరే నిర్మాతలకు లాభాలే అని అంటున్నారు.

సినిమా ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు కాబట్టి కళ్యాణ్ రాం తో కిరణ్, భరత్ నిర్మాతలు ఇద్దరు సేఫ్ అయినట్టే అంటున్నారు. ఇదవరకు వీరు నిర్మించిన రానా నేనే రాజు నేనే మంత్రి సినిమాకు కూడా ఇలాంటి బిజినెస్ ట్యాక్ టిక్స్ వల్లే ఆ సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలక్షన్స్ రాబట్టింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news