Gossipsఆవేశంలో అసలు విషయం బయటపెట్టిన చిరు

ఆవేశంలో అసలు విషయం బయటపెట్టిన చిరు

సుకుమార్ డైరక్షన్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా వస్తున్న సినిమా రంగస్థలం. సినిమా ఈ నెల 30న రిలీజ్ అవుతుండగా నిన్న సాయంత్రం వైజాగ్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చిన ఈ వేడుకలో మెగా ఫ్యాన్స్ కోలాహలంతో వేడుక అదిరిపోయింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన సినిమా ట్రైలర్ కూడా ఆకట్టుకుంది.

సినిమా గురించి మాట్లాడిన చిరంజీవి ఫ్లోలో చరణ్ ఎమోషనల్ సీన్స్ గురించి మాట్లాడి సినిమాలో ఆది చనిపోతాడని ఓ టాప్ సీక్రెట్ ను రివీల్ చేశాడు. చరణ్ కు అన్నగా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. సినిమాలో అతని క్యారక్టర్ చాలా ట్విస్టులతో ఉంటుందట. ఆ పాత్ర చనిపోయేది చివరిదాకా సస్పెన్స్ అని అన్నారు.

కాని చిరంజీవి చరణ్ ఎమోషనల్ సీన్స్ బాగా చేస్తాడని పుత్రోత్సాహంతో సినిమాకు సంబందించిన మెయిన్ పాయింట్ ను లీక్ చేశాడు. చిరు అలా మాట్లాడటం సుకుమార్ కు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన రంగస్థలం సినిమాలో చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news