Gossipsఅజ్ఞాతవాసి సాక్షిగా పవన్-చిరు కలయిక జరుగుతుందా..?

అజ్ఞాతవాసి సాక్షిగా పవన్-చిరు కలయిక జరుగుతుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. త్రివిక్రమ్ క్రేజీ కంబినేషన్ లో ఎన్నో అంచనాలతో వస్తున్న అజ్ఞాతవాసి సినిమా భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా ప్రజల ముందుకు రాబోతోంది. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హాసిని క్రియేషన్స్ పతాకంలో కె. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అయితే చాలా రోజులుగా ఈ సినిమా ఆడియో రిలీజ్ ఎప్పుడా ఎప్పుడా అని చాలా రోజులుగా ఎదురు చూపులు చూస్తున్నారు. అయితే ఆ ఎదురు చూపులు ఫలించినట్టు ఉన్నాయి. ఈ సినిమా ఆడియో ఈ నెల 16న నోవాటెల్ లో రిలీజ్ చేస్తున్నారట. ఈ ఆడియో వేడుకకు మెగాస్టార్ ముఖ్య అతిథిగా వస్తున్నారని సినిమా యూనిట్ నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తోంది. చాలా కాలం తరువాత మెగా బ్రదర్స్ ఒకే స్టేజ్ మీద కనిపించబోతుండడంతో అభిమానులకు ఇక పండగే.

కొంత కాలంగా మెగా బ్రదర్స్ మధ్య విబేధాలు వచ్చాయని గుసగుసలు వినిపిస్తున్ననేపథ్యంలో ఈ మెగా బ్రదర్స్ కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మధ్య కాలంలో రాజకీయ దూకుడు పెంచిన పవన్ కళ్యాణ్ పనిలో పనిగా తన అన్న మీద ఉన్న ప్రేమ చాటుకున్నాడు. తన అన్నకి ద్రోహం చేసిన వారిని ఎవ్వరిని వదిలిపెట్టను అని సవాల్ కూడా విసిరాడు. ఈ నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. అన్నయ్య మీద ప్రేమను చూపిస్తున్న పవన్ ఈసారి ఇద్దరు కలిసి పాల్గొంటున్న ఈ వేడుకలో ఏం మాట్లాడతారు అనే విషయం అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news