MoviesCM కి మద్దతుగా భహిరంగ సభకు హాజరవుతున్న ఎన్టీఆర్, చరణ్

CM కి మద్దతుగా భహిరంగ సభకు హాజరవుతున్న ఎన్టీఆర్, చరణ్

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భరత్ అనే నేను. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో మహేష్ సిఎం పాత్రలో కనిపిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఏప్రిల్ 20న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 7న జరుపనున్నారు.

ముందు వైజాగ్, విజయవాడలో ఈ ఈవెంట్ ప్లాన్ చేద్దామని అనుకోగా చివరకు హైదరాబాద్ లోనే ఈ సినిమా ఈవెంట్ నిర్ణయించారు. ఇక ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా ఎన్.టి.ఆర్ వస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు భరత్ ఈవెంట్ కు రంగస్థల కథానాయకుడు చిట్టిబాబు కూడా రాబోతున్నాడని అంటున్నారు.

మహేష్, ఎన్.టి.ఆర్, చరణ్ ఇలా ముగ్గురు స్టార్స్ ఒకే వేదిక మీద కనబడితే ఫ్యాన్స్ కు కన్నుల పండుగ అన్నట్టే. ఇప్పటికే వారికి ఇన్విటేషన్ అందినట్టు సమాచారం. మరి నిజంగానే ఈ ఎన్.టి.ఆర్, చరణ్ భరత్ అనే నేను ఆడియోకి వస్తారా లేదా అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news