Newsషాకింగ్ షాకింగ్: బిగ్ బాస్ పై వంద కోట్ల పరువు...

షాకింగ్ షాకింగ్: బిగ్ బాస్ పై వంద కోట్ల పరువు నష్టం.. వివాదం ఇదే!!

త‌మిళ బిగ్‌బాస్ షో, హోస్ట్ క‌మ‌ల్‌హాస‌న్‌, పార్టిసిపెంట్ గాయ‌త్రి ర‌ఘురామ్‌పై వంద కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావా దాఖ‌లు చేశారు కొంద‌రు మురికివాడ‌ల సభ్యులు. త‌మిళ వెర్ష‌న్ బిగ్‌బాస్ షో సంద‌ర్భంగా అందులో పార్టిసిపెంట్ అయిన కొరియోగ్రాఫ‌ర్ గాయ‌త్రి ర‌ఘురామ్‌.. మ‌రో కంటెస్టెంట్‌ను చెరి (మురికివాడలో ఉండే వ్య‌క్తి) అని తిట్ట‌డాన్ని పుతియ త‌మిళ‌గ‌మ్ అనే ఆ సంఘం స‌భ్యులు త‌ప్పుబ‌ట్టారు.

స‌మాజంలో ఉన్న బ‌డుగువ‌ర్గాల వారి మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ‌ని వాళ్లు ఆరోపించారు. ఈ షోకు హోస్ట్‌గా ఉన్న క‌మ‌ల్ హాస‌న్ .. గాయ‌త్రి ర‌ఘురామ్ వ్యాఖ్య‌ల‌కు అభ్యంత‌రం చెప్ప‌క‌పోవ‌డంతో అత‌నికి కూడా ఈ నోటీసులు పంపిన‌ట్లు ఆ స‌భ్యులు తెలిపారు. ఓ ప్రెస్‌మీట్‌లో ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌శ్నించ‌గా.. క‌మ‌ల్‌హాస‌న్ స‌రిగా స్పందించ‌లేద‌ని, దీనిని ఖండించ‌లేద‌ని ఆ సంఘం స‌భ్యులు ఆరోపించారు. వారం రోజుల్లోగా తమ నోటీసులు అందుకున్న వ్య‌క్తులు బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని, లేదంటే వంద కోట్లు ప‌రువు న‌ష్టం కింద ఇవ్వాల‌ని సంఘం నేత డాక్ట‌ర్ క్రిష్ణస్వామి డిమాండ్ చేశారు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news