Gossipsతారక్ అల్లరోడు : భూమిక సంచలన వ్యాఖ్యలు

తారక్ అల్లరోడు : భూమిక సంచలన వ్యాఖ్యలు

కొన్నేళ్ళ కిందట టాప్ హీరోయిన్ గా మెరిసిన నటి భూమిక చావ్లా క్రేజ్ ఇప్పటికి ఏమీ తగ్గలేదు. ఆమె ఏ పాత్రలో చేసినా అందులో వదిగిపోవడం ఆమె స్టైల్. తెలుగు ఇండ్రస్ట్రీలో దాదాపు టాప్ హీరోలు అందరి పక్కనా నటించి మెప్పించింది. ఇండ్రస్ట్రీలో తనకంటూ చాలామంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. సుమంత్ హీరో గా వచ్చిన యువకుడు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన భీమిక ఆ తరువాత వచ్చిన ఖుషి సినిమాతో ఒక్క సారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోవడమే కాదు ఆ తరువాత ఇక వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా వరుస అవకాశాలతో దూసుకెళ్లింది.
తారక్ తో నటించిన సింహాద్రి  సినిమా మాత్రం భూమిక క్రేజ్ ని అమాంతం పేంచేసింది. ఆ తరువాత పెళ్లి చేసుకుని ఇండ్రస్ట్రీకి దూరం అయినా .. ప్రస్తుతం మళ్ళీ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో ఎంట్రీ ఇస్తోంది. ఇటీవల నాని హీరో గా వచ్చిన  ఎంసీఏ లో హీరో కి వదినగా నటించింది. ఈ సినిమా లో తన నటనకు మంచి పేరు వచ్చింది. ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చాలా విషయాలు షేర్ చేసుకొన్నది. తను ఇప్పుడు హీరోహిన్ గా చేయలేనని అలాగే 60 ఏళ్ల వయస్సు ఉన్న పాత్ర లో చేయలేనని చెప్పింది. ఇంతకు ముందు తనకు తెలుగు చలా అవకాశాలు వచ్చిన, నటించడానికి సాద్యపడలేదని చెప్పింది.
ఈ సందర్భంగా యువ హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. మహేష్ చాలా… సైలెంట్ గా ఉంటాడంటా అయితే చాలా సెన్సాఫ్ హుమర్ ఉందని చెప్పుకొచ్చింది. అయితే వెంకటేష్ కు ఆధ్యాత్మిక భావన ఎక్కవని చెప్పింది. పవన్ సెన్సిబుల్ అని చెప్పింది. అయితే జూనియర్ గురించి తను చాలా సరదాగా ఉంటాడని … ఎక్కువగా అల్లరి చేస్తాడని,అంతే కాకుండా  తను చాలా అమయాకుడు అంటూ జూనియర్ మీద ఉన్న తన అభిమానాన్ని అంతా వ్యక్తపరిచింది ఈ సింహాద్రి హీరోయిన్.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news