Newsహోదా కోసం.. కదం తొక్కిన యువ హీరోలు..!

హోదా కోసం.. కదం తొక్కిన యువ హీరోలు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తెలుగు సినీ పరిశ్రమలో కదలిక మొదలయింది. సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఉద్యమానికి తమిళుల జల్లికట్టు ఉద్యమం లాగే అందరూ ఏకమై మద్దతు తెలపాలని కోరారు.ఈ నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ హీరోలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దత్తు తెలపడం ప్రారంభించారు.టాలీవుడ్ యువహీరోలు నిఖిల్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్ మరియు సంపూర్ణేష్ బాబు వంటి హీరోలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు వారి మద్దతును ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.జనవరి 26న వైజాగ్ ఆర్కే బీచ్ లో జరగనున్న ప్రత్యేక హోదా మౌన పోరాటానికి యువహీరోలు వారి మద్దత్తుని ప్రకటించారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ జనవరి 26న ప్రత్యేక హోదా ఉద్యమానికి తన మద్దత్తు తెలుపనున్నట్లు ప్రకటించారు.

తమిళనాడులో జల్లికట్టుకు అక్కడి హీరోలు ఏ విధంగా మద్దతు తెలిపి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి జల్లికట్టుకు అనుమతి పొందారో అలాగే మన యంగ్ హీరోలు సైతం ఆంధ్రప్రదేశ్ కి హోదా విషయంలో ఒకరి తర్వాత ఒకరు వారి మద్దతును ట్వీట్ల ద్వారా తెలియచేస్తున్నారు.

 

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news