Gossipsమ‌హేష్ సినిమాలో పాట పాడిన స్టార్ హీరోయిన్‌

మ‌హేష్ సినిమాలో పాట పాడిన స్టార్ హీరోయిన్‌

ఇటీవ‌లే స్పైడ‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి నిరాశ‌ప‌రిచిన సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు త‌న నెక్ట్స్ సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నాడు. గ‌తంలో త‌న‌కు శ్రీమంతుడు లాంటి ఆల్ టైం కెరీర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర‌త్ అను నేను సినిమాలో న‌టిస్తున్నాడు. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను వ‌చ్చే స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 27న రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

మ‌హేష్ – కొర‌టాల‌ది హిట్ కాంబినేష‌న్ కావ‌డం, పైగా కొర‌టాల మూడు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ల‌తో ఫామ్‌లో ఉండ‌డంతో ఈ సినిమాకు అప్పుడే ప్రి రిలీజ్ బిజినెస్ ఎంక్వైరీలు టాప్ రేంజ్‌లో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ ఓ సాంగ్ పాడారు. ఈ విష‌యాన్ని ఆమే స్వ‌యంగా త‌న తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ప్రముఖ తమిళ హీరోయిన్ ఆండ్రియా
భ‌ర‌త్ అను నేను ఆల్బ‌మ్ కోసం ఓ సాంగ్ పాడార‌ట‌.

ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తోన్న రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ద‌గ్గ‌రుండి మ‌రీ ఆమె చేత ఈ సాంగ్‌ను పాడించిన‌ట్టు ఆండ్రియా చెప్పింది. ఇక ఆండ్రియా స్వ‌త‌హాగా ప్లే బాక్ సింగ‌ర్‌. ఆమె గ‌తంలో దేవి సార‌ధ్యంలో ఎన్టీఆర్ రాఖీ సినిమాకు సైతం ఓ పాట పాడారు. రాఖీ సినిమాలోని జర జర అనే పాటను ఆండ్రియా పాడింది. ఇక డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న భ‌ర‌త్ అను నేను సినిమాను వ‌చ్చే యేడాది ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news