Newsగ్రేట్‌ ఆఫర్ కు తెరతీసిన అమెజాన్

గ్రేట్‌ ఆఫర్ కు తెరతీసిన అమెజాన్

అదిరిపోయే ఆఫర్లతో ఆన్‌లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ ఆగస్టు 12 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో భాగంగా పలు రకాల గాడ్జెట్స్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తోంది. యాపిల్, లెనొవొ, వన్‌ప్లస్, సామ్సంగ్, హానర్, ఇన్‌ఫోకస్, సోనీ వంటి అన్ని ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఇస్తోంది. అలాగే స్మార్ట్‌ఫోన్లపై ప్రత్యేకంగా క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డు యూజర్లు అమెజాన్ యాప్‌పై కొనుగోలు చేస్తే 15 శాతం, వెబ్‌సైట్‌లో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.

ఇక 30వేలకు పైగా ఉత్పత్తులపై ‘నో కాస్ట్ ఈఎంఐ’ సదుపాయాన్ని కూడా అమెజాన్ కల్పిస్తోంది. స్మార్ట్‌ఫోన్స్, కెమెరాస్, లాప్‌టాప్స్ ఇలా అన్ని వస్తువులపై ఈ ఆఫర్‌ను వర్తింపజేస్తోంది. ఎలాంటి వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు లేకుండా మీ క్రెడిట్ కార్డుతో సులభ వాయిదాల పద్ధతిలో చెల్లించొచ్చు. కాగా, గాడ్జెట్ ప్రియుల కోసం ‘అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్’లో అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్స్, హెడ్‌ఫోన్స్, ఫిట్‌నెస్ బ్యాండ్స్, స్మార్ట్‌వాచెస్, పవర్ బ్యాంక్స్ వంటి గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news