Newsదాసరి శవం దగ్గర ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ .....

దాసరి శవం దగ్గర ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ .. క్లాస్ పీకిన అల్లు అర్జున్

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు పార్థివ దేహాన్ని హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్థం ఉంచిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సినీ ప్రముఖులంతా దాసరిని కడసారి చూసేందుకు తరలి వచ్చారు. ఈ సమయంలో అల్లు అర్జున్ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఈ సమయంలో అల్లు అర్జున్ ను అభిమానులు చుట్టుముట్టారు. దీంతో బౌన్సర్లు అతనికి రక్షణ కల్పించారు. దీంతో అల్లు అర్జున్ ను తమ సెల్ ఫోన్లలో బంధించేందుకు వారంతా పోటీలు పడ్డారు. ఈ సమయంలో మరికొందరు ఉత్సాహవంతులైన అభిమానులు అల్లు అర్జున్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులకు సరికాదని సైగలు చేశారు. ఇది సమయం కాదని, ఇలాంటప్పుడు అలాంటి నినాదాలు చేయడం సరికాదని హితవు పలికారు. ఆపేయాలని వారికి సూచించారు. దీంతో అభిమానులు శాంతించారు. దీంతో ఆయన దాసరి పార్థివదేహాన్ని సందర్శించి వెళ్లిపోయారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news