Gossipsపైరసీ వలలో 'అజ్ఞాతవాసి'... టెన్షన్ లో సినీ వర్గం..

పైరసీ వలలో ‘అజ్ఞాతవాసి’… టెన్షన్ లో సినీ వర్గం..

అజ్ఞాతవాసికి మరో అజ్ఞాతవాసి బెదిరింపు. అవును మీరు చదువుతున్నది నిజమే ! ఆ సినిమా నిర్మాతకి ఎవరో గుర్తుతెలియని అజ్ఞాతవాసి ఫోన్ చేసి మరీ బెదిరించాడట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజంతా వాసి సినిమాను మేము పైరసీ చేయబోతున్నాం అంటూ… సదరు ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించాడట. దీంతో ఆ సినిమా నిర్మాత సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

పవన్ సినిమాలకి ఇదేం కొత్త కాదు. గతంలోనూ త్రివిక్రమ్ – పవన్ కాంబినేషన్ లో వచ్చిన “అత్తారింటికి దారేది”.సినిమాను కూడా రిలీజ్ కి ముందే పైరసీ చేసేసారు. అప్పట్లో ఇది ఇండ్రస్ట్రీలో ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఒక పెద్ద హీరో సినిమానే ఇలా పైరసీ కి గురైతే ఇక చిన్న సినిమాల పరిస్థితి ఏంటి అని అందరూ భయపడ్డారు.

మళ్ళీ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్నఈ సినిమాకి కూడా ఇలా బెదిరింపులు రావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అజ్ఞాతవాసి సినిమాని కూడా “అత్తారింటికి దారేది” లాగే పైరసీ చేస్తాం అంటూ నిర్మాతకి ఫోన్ చేసి బెదిరించడంతో … వెంటనే నిర్మాత అయిన రాధాకృష్ణ సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news